ప్రేయసిని పదేళ్ల పాటు గదిలో రహస్యంగా దాచిన ఘటన గుర్తుంది కదా.. తాజాగా ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-09-16T20:45:55+05:30 IST

చుట్టుపక్కల వారికి, సొంత కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా ప్రేయసి సజితని పదేళ్ల పాటు తన గదిలో దాచిన రెహమాన్ గుర్తున్నాడా?

ప్రేయసిని పదేళ్ల పాటు గదిలో రహస్యంగా దాచిన ఘటన గుర్తుంది కదా.. తాజాగా ఏం జరిగిందంటే..

చుట్టుపక్కల వారికి, సొంత కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా ప్రేయసి సజితని పదేళ్ల పాటు తన గదిలో దాచిన రెహమాన్ గుర్తున్నాడా? ఈ ఏడాది జూన్‌లో బయటకు వచ్చిన వీరి కథ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తాజాగా వారిద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు.  కేరళలోని పాలక్కాడ్ జిల్లా నెన్‌మారా పట్టణం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక వివాహ చట్టం కింద బుధవారం ఈ పెళ్లి జరిగింది. 


ఇవి కూడా చదవండి

నా భార్యకు పుట్టిన బిడ్డకు నేను తండ్రిని కాదు.. కోర్టుకెక్కిన ఓ భర్త.. అసలు శారీరకంగానే కలవలేదంటూ షాకింగ్ నిజాలు..




భర్త ఆఫీసుకు వెళ్లాడనుకుని ప్రేయసిని కలిసేందుకు నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడా ప్రియుడు.. చివరకు కథ అడ్డం తిరిగిందిలా..!


పాలక్కాడ్ జిల్లాలోని అలియూర్ గ్రామానికి చెందిన వేలాయుధన్ అనే వ్యక్తి 18యేళ్ల తన కుమార్తె సజిత కనపడటం లేదని 2010 ఫిబ్రవరి 2న పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసులు, సజిత తల్లిదండ్రులు ఎంత వెతికినా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. ఏళ్లు గడుస్తున్నా ఆమె తిరిగి రాకపోవడంతో చనిపోయిందని అనుకున్నారు. రేషన్ కార్డులో ఆమె పేరు కూడా తీసేశారు. అయితే ఆమె బతికే ఉంది. ఆ గ్రామంలోని వాళ్లింటికి పదిళ్ల అవతల ఉన్న ఇంట్లోనే ఆమె పదేళ్లపాటు ఉంది. రెహమాన్ అనే యువకుడిని ప్రేమించిన సజిత పదేళ్ల క్రితం అతడి ఇంటికి వెళ్లిపోయింది. 


తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఇంట్లో తన గదిలోనే సజితను రెహమాన్ పదేళ్ల పాటు ఉంచాడు. అర్ధరాత్రి సమయంలో ఆమె కిటికీ గుండా బయటకు వచ్చి కాలకృత్యాలు తీర్చుకునేది. ఈ ఏడాది జూన్ నెలలో ఆమె బయటపడింది. ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చి వేరే ఇంట్లో నివసిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. తాజాగా వారిద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.  

Updated Date - 2021-09-16T20:45:55+05:30 IST