నవ దంపతుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-30T14:29:58+05:30 IST

ఈరోడ్‌ సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోడ్‌ జిల్లా ఆప్ప కూడల్‌ సమీపం మల్లియూర్‌కు చెందిన మెకానికల్‌ ఇంజినీర్‌ ఇళంగో(23), రమ్య(23)

నవ దంపతుల ఆత్మహత్య

చెన్నై : ఈరోడ్‌ సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోడ్‌ జిల్లా ఆప్ప కూడల్‌ సమీపం మల్లియూర్‌కు చెందిన మెకానికల్‌ ఇంజినీర్‌ ఇళంగో(23), రమ్య(23) కళాశాల చదివే రోజుల్లోనే ప్రేమించుకున్నారు. మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, ఉదయం ఎంతసేపటికి వీరు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన చుట్టుపక్కలవారు కిటికీ నుంచి చూశారు. వారు ఉరేసుకుని ఉండడాన్ని గమనించి ఆప్పుకూడల్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆందియూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. వివాహమై మూడు నెలలే కావడంతో ఈ ఘటనపై ఆర్డీవో విచారణ చేపట్టారు.

Updated Date - 2020-09-30T14:29:58+05:30 IST