మీరే ఉంచుకోండి!
ABN , First Publish Date - 2020-06-03T08:12:53+05:30 IST
ఆ దంపతులది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నగరం. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న తమ 9నెలల శిశువుకు స్థానిక ఆస్పత్రి లో చికిత్స ఇప్పిస్తున్నారు. అక్కడ చేసిన పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్గా తేలింది...
- బిడ్డ మృతదేహాన్ని ఆస్పత్రిలోనే వదిలేసిన తల్లిదండ్రులు
న్యూఢిల్లీ, జూన్ 2: ఆ దంపతులది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నగరం. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న తమ 9నెలల శిశువుకు స్థానిక ఆస్పత్రి లో చికిత్స ఇప్పిస్తున్నారు. అక్కడ చేసిన పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో బిడ్డను తీసుకుని ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. చికిత్స అందించే లోపే అతడు కన్నుమూశాడు. శవాన్ని ఊరికి తీసుకెళ్తే తమను కూడా అందరూ వెలి వేస్తారని భయపడిన ఆ తల్లిదండ్రులు, మృతదేహాన్ని మీ వద్దే ఉంచుకోండి అంటూ ఆస్పత్రి వర్గాలకు లేఖ రాసి వెళ్లిపోయారు. చేసేది లేక, ఆ శిశువుకు ఎయిమ్స్ అధికారులే అంత్యక్రియలు నిర్వహించారు.