రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి.. బయటపడిన కవలలు

ABN , First Publish Date - 2020-03-17T19:33:24+05:30 IST

కామారెడ్డి: సదాశివనగర్‌ మండలం భూంపల్లి దగ్గర విషాదం నెలకొంది. బైక్‌ను డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో బైక్‌పై నున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి.. బయటపడిన కవలలు

కామారెడ్డి: సదాశివనగర్‌ మండలం భూంపల్లి దగ్గర విషాదం నెలకొంది. బైక్‌ను డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో బైక్‌పై నున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి కవల పిల్లలు మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. తల్లిదండ్రుల మృతితో కవలలిద్దరూ అనాథలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Updated Date - 2020-03-17T19:33:24+05:30 IST