AP News: విశాఖ రుషికొండ బీచ్లో జంట మృతదేహాల కలకలం
ABN , First Publish Date - 2022-08-12T18:34:52+05:30 IST
విశాఖ రుషికొండ బీచ్లో జంట మృతదేహాలు కలకలం రేపుతున్నాయి.
విశాఖపట్నం: విశాఖ రుషికొండ బీచ్ (Rushikonda Beach)లో జంట మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. నిన్న రుషికొండ తీరానికి ఓ యువకుడి మృతదేహాం చేరుకుంది. మృతుడు నంద్యాలకు చెందిన వెంకటరెడ్డిగా గుర్తించారు. కాగా ఈరోజు తెల్లవారుజామున యువతి మృతదేహాం రుషికొండ తీరానికి కొట్టుకువచ్చింది. మృతురాలు విజయనగరంకు చెందిన దివ్యగా గుర్తించారు. ఇద్దరు మృతి చెందడం వెనుక ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.