పెళ్లి వేడుకలో వధూవరుల అరెస్ట్.. షాక్‌లో బంధుమిత్రులు.. అసలు కారణమేంటో తెలిస్తే..!

ABN , First Publish Date - 2022-02-09T18:44:26+05:30 IST

పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది.. వేదిక మీద వధూవరులు ఎంతో సంతోషంగా ఉన్నారు..

పెళ్లి వేడుకలో వధూవరుల అరెస్ట్.. షాక్‌లో బంధుమిత్రులు.. అసలు కారణమేంటో తెలిస్తే..!

పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది.. వేదిక మీద వధూవరులు ఎంతో సంతోషంగా ఉన్నారు.. అలాంటి సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.. నేరుగా వధూవరుల దగ్గరకు వెళ్లి వారిని అరెస్ట్ చేశారు.. షాకైన బంధుమిత్రులకు అసలు విషయం చెప్పారు.. వరుడి మాజీ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు.. ఆమె ఇచ్చిన ఫిర్యాదు దేని గురించో తెలిసి అందరూ షాకయ్యారు. 


మేరీ, ఆడమ్ అనే ఇద్దరు సహోద్యోగులు గతంలో వివాహం చేసుకుని అభిప్రాయ భేదాల వల్ల విడాకులు తీసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత చెల్సియా అనే యువతితో ఆడమ్ పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుని అతిథులందరినీ పిలిచాడు. ఆ అతిథుల్లో మేరీ స్నేహితురాలు రెడిట్టర్ కూడా ఉంది. పెళ్లి రోజున వధువు చెల్సియా ధరించిన బట్టలు, నగలు చూసి రెడిట్టర్ షాక్‌కు గురైంది. ఎందుకంటే అవి మేరీ పెళ్లి రోజు ధరించినవి. దీంతో వెంటనే ఆ విషయాన్ని మేరీకి రెడిట్టర్ తెలిపింది. 


మేరీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వివాహ వేడుక వద్దకు వెళ్లి ఆడమ్, చెల్సియాలతో మాట్లాడారు. ఆ నగలను, బట్టలను మార్చమని సూచించారు. అందుకు చెల్సియా అంగీకరించలేదు. ఆడమ్, మేరీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆడమ్ నుంచి విడిపోయేటపుడు తన వెడ్డింగ్ డ్రెస్, వారసత్వంగా వచ్చిన నగలు ఎంత వెతికినా దొరకలేదని, ఆడమ్‌ను అడిగితే తనకు తెలియదన్నాడని, ఇప్పుడు అసలు విషయం బయటపడిందని మేరీ చెబుతోంది. 

Updated Date - 2022-02-09T18:44:26+05:30 IST