షాకింగ్.. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రియుడి శవం.. మధ్యప్రదేశ్లో యువతి మృతదేహం.. అతడి మర్మాంగాలను కోసి మరీ..!
ABN , First Publish Date - 2021-09-18T21:02:59+05:30 IST
వారిద్దరివీ ఎదురెదురు ఇళ్లు.. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు..
వారిద్దరివీ ఎదురెదురు ఇళ్లు.. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు.. ఆ స్నేహం ప్రేమగా మారింది.. ఆ ప్రేమను పెద్దవాళ్లు అంగీకరించలేదు.. దాంతో వారు ఊరు వదిలి పారిపోయారు.. ఇటీవల వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రియుడి శవం దొరికింది.. మధ్యప్రదేశ్లో యువతి మృతదేహం దొరికింది.. పోలీసుల విచారణలో ఇద్దరి హత్యలకు లింక్ ఉన్నట్టు తేలింది.. దీంతో ఇరు కుటుంబాల వారినీ అదుపులోకి తీసుకున్నారు..
ఉత్తరప్రదేశ్లోని జహంగీర్పూర్కు చెందిన యువకుడు తన ఎదురింట్లో ఉంటున్న యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. అందుకు ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకరించలేదు. దీంతో ఆమెను తీసుకుని అతడు ఢిల్లీ వెళ్లిపోయాడు. ఆమెకు ఇంకా మైనార్టీ తీరనప్పటికీ ఆమెతో ఢిల్లీలో కలిసి నివసించాడు. అప్పట్నుంచి వారి గురించి ఇరు కుటుంబాల పెద్దలూ అన్వేషణ సాగించారు. ఢిల్లీలో ఉన్నట్టు తెలుసుకున్నారు.
ఫొటోలో కనిపిస్తున్న మహిళ మెడలో ఉన్న స్కార్ఫ్ ధర ఎంతో తెలుసా..
పెళ్లికి అతిథిగా వచ్చిన మహిళకు జరిమానా చెల్లించిన వరుడి కుటుంబం
ముందుగా యువతి తరఫు బంధువులు వారి ఆచూకీ తెలుసుకుని జీపులో ఢిల్లీ వెళ్లారు. వారిని అక్కడ కిడ్నాప్ చేసి ముందుగా రాజస్థాన్లోని ఝాన్సీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ యువకుడిని చంపేశారు. అంతేకాదు అతడి మర్మాంగాన్ని కూడా కోసేశారు. అనంతరం మధ్యప్రదేశ్లోని బింద్ ప్రాంతంలో యువతిని ఉరేసి చంపేశారు. రాజస్థాన్ పోలీసులు యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాఫ్తు ప్రారంభించారు. అనంతరం మధ్యప్రదేశ్లో దొరికిన యువతి మృతదేహం గురించి తెలుసుకుని రెండు హత్యలకు లింక్ ఉన్నట్టు తెలుసుకున్నారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా యువతి కుటుంబీకులే ఈ హత్యలు చేశారని తేల్చారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.