చైనా వ్యాక్సిన్ వాడుతున్న దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు!

ABN , First Publish Date - 2021-06-24T00:29:26+05:30 IST

కరోనా మహమ్మారి తొలిసారిగా వెలుగు చూసిన చైనాలో.. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కూడా అంతే త్వరగా కనిపెట్టారు.

చైనా వ్యాక్సిన్ వాడుతున్న దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు!

న్యూయార్క్: కరోనా మహమ్మారి తొలిసారిగా వెలుగు చూసిన చైనాలో.. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కూడా అంతే త్వరగా కనిపెట్టారు. ఆ తర్వాత ఈ వ్యాక్సిన్‌ను పాకిస్తాన్ వంటి దేశాలు కొనుగోలు చేసి తమ ప్రజలకు అందజేస్తున్నాయి. ఇలా చైనా వ్యాక్సిన్లు అందుకున్న దేశాలకు ముచ్చెమటలు పట్టించే విషయం ఇప్పుడు వెలుగు చూసింది. చైనా తయారు చేసిన వ్యాక్సిన్లు కొత్తగా బయటపడుతున్న కరోనా వేరియంట్లను అడ్డుకోలేకపోతున్నాయని కొందరు నిపుణులు చెప్తున్నారు. ఈ మేరకు ఒక ప్రఖ్యాత పత్రిక కథనం ప్రచురించింది. దీని ప్రకారం, సేచెలిస్, చిలీ, బహ్రెయిన్, మంగోలియా వంటి దేశాల్లో చైనా తయారు  చేసిన సైనోఫార్మ్, సైనోవ్యాక్ వ్యాక్సిన్లనే ఉపయోగిస్తున్నారు. ఈ దేశాల్లో 50-68శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. అయినా సరే గడిచిన వారంరోజుల్లో వైరస్ అవుట్‌బ్రేక్ తీవ్రంగా ఉన్న టాప్ టెన్ దేశాల్లో ఈ దేశాలన్నీ ఉన్నాయి. దీన్నే ప్రస్తావించిన నిపుణులు కరోనా కొత్త వేరియంట్లపై చైనా వ్యాక్సిన్లు పెద్దగా ప్రభావం చూపడం లేదని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-24T00:29:26+05:30 IST