చోడవరంలో ఆలయాల హుండీలు లెక్కింపు
ABN , First Publish Date - 2021-04-13T05:53:48+05:30 IST
పట్టణంలోని ప్రముఖ స్వయంభూ విఘ్నేశ్వర, వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో హుండీల లెక్కింపు కార్యక్రమం సోమవారం జరిగింది.
చోడవరం, ఏప్రిల్ 12: పట్టణంలోని ప్రముఖ స్వయంభూ విఘ్నేశ్వర, వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో హుండీల లెక్కింపు కార్యక్రమం సోమవారం జరిగింది. దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వయంభూ విఘ్నేశ్వరుడి హుండీ ఆదాయం ఈ ఏడాది జనవరి 4 నుంచి ఏప్రిల్ 12 వరకూ రూ.3.18 లక్షల ఆదాయం లభించింది. అలాగే వేంకటేశ్వస్వామి ఆలయంలో హుండీ నుంచి రూ.96,338 ఆదాయం వచ్చింది. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు, ఈవో ఎస్వీవీ సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు నున్న నాగేశ్వరరావు, పూసర్ల రవీంద్ర, అర్చకులు కొడమంచిలి చలపతి, వెంకటరావు, వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్ కందర్ప గౌరీశంకర్, అర్చకులు శాంతారామాచార్యులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.