మేడారం హుండీల లెక్కింపు
ABN , First Publish Date - 2022-02-25T02:36:53+05:30 IST
అంగరంగ వైభవంగా జరిగిన మేడారం జాతర హుండీల
హనుమకొండ: అంగరంగ వైభవంగా జరిగిన మేడారం జాతర హుండీల ద్వరా వచ్చిన ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. రెండు రోజులలో వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. బుధవారం 65 హుండీల ద్వారా రూ. 1,34,60,000ల ఆదాయం వచ్చింది. గురువారం 116 హుండీల ద్వారా రూ.2,50,62,000ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది.ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు వచ్చారు. ఆసియాలోనే అతిపెద్దదైన గిరిజన జాతరగా మేడారం జాతరకు పేరుంది.