ఐపీఎల్ కోసం కౌంటీలు సిద్ధం
ABN , First Publish Date - 2021-05-07T10:17:41+05:30 IST
ఐపీఎల్లో మిగతా సగం మ్యాచ్లను నిర్వహించేందుకు ఇంగ్లండ్లోని కౌంటీలు ముందుకు వచ్చాయి.
లండన్: ఐపీఎల్లో మిగతా సగం మ్యాచ్లను నిర్వహించేందుకు ఇంగ్లండ్లోని కౌంటీలు ముందుకు వచ్చాయి. బీసీసీఐకి ఈ విషయం తెలపాల్సిందిగా ఎంసీసీ, సర్రే, వార్విక్షైర్, ఓవల్, ఎడ్జ్బాస్టన్ కౌంటీ క్లబ్బులు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కు లేఖ రాశాయి. లీగ్ను సెప్టెంబరు రెండో వారంలో ఆరంభించి రెండు వారాల్లోపు ముగిసేలా ప్రణాళికలు రచించాలని కోరాయి. ఇదే జరిగితే టీ20 ప్రపంచక్పనకు ముందే టాప్ క్రికెటర్లకు మంచి ప్రాక్టీస్ లభించినట్టవుతుందని అభిప్రాయపడ్డాయి. యూకే మార్కెట్కు కూడా లాభదాయకమేనని పేర్కొన్నాయి. ఇంగ్లండ్లో కేసులు ఎక్కువగా లేవు కాబట్టి మ్యాచ్లను కూడా ప్రేక్షకుల మధ్యన ఆడించవచ్చు.
అయితే ప్రపంచవ్యాప్త క్రికెటర్ల రాకతో వారందరినీ క్వారంటైన్లో ఉంచడం అక్కడ సమస్య కావచ్చు. భారత్-ఇంగ్లండ్ సిరీస్ సెప్టెంబరు 14న ముగుస్తుంది. ఆ వెంటనే ఇంగ్లండ్ జట్టు పాక్, బంగ్లాదేశ్ టూర్లకు వెళ్లాలి. కాబట్టి అక్కడ జరపడం అంత సులువు కాకపోవచ్చు. అయినా ఏదో ఓ విండో లభిస్తే రోజుకు రెండు మ్యాచ్లను ఆడించైనా లీగ్ను జరపాలని కౌంటీలు కోరుకుంటున్నాయి.