AP News: వైసీపీకి ఇంటింటా కౌంట్‌డౌన్‌ మొదలైంది: అచ్చెంనాయుడు

ABN , First Publish Date - 2022-08-09T02:21:58+05:30 IST

Amaravathi: టీడీపీ నేత అచ్చెంనాయుడు (Achennayudu) వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌ (CM Jagan)కు కేసులు, అప్పులపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాల‌పై లేదని ఆరోపించారు. తెలుగు వారి పరువు తీసిన హిందూపురం ఎంపీ గోరంట్ల

AP News: వైసీపీకి ఇంటింటా కౌంట్‌డౌన్‌ మొదలైంది: అచ్చెంనాయుడు

Amaravathi: టీడీపీ నేత అచ్చెంనాయుడు (Achennayudu) వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌ (CM Jagan)కు కేసులు, అప్పులపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాల‌పై  లేదని ఆరోపించారు. తెలుగు వారి పరువు తీసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌(MP Gorantla Madhav)పై ఏ చర్యలు తీసుకోకుండా తెలుగుదేశం నేతల‌పై ప్రతి విషయానికి నోరుపారేసుకోవడం వైసీపీ నాయకులపై అలవాటైపోయిందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ మంత్రులకు ప్రజాదరణ కరువైందని పేర్కొన్నారు. వైసీపీకి  ఇంటింటా కౌండౌన్‌ మొదలైందన్నారు. త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు టూలెట్‌ బోర్డు ఖాయమన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఎందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు. సజ్జలపై అచ్చెంనాయుడు మండిపడ్డారు. ‘‘అసలు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ప్రభుత్వ సలహాదారుడా? లేక వైసీపీ సలహాదారుడా? మూడేళ్ల నుంచి లక్షల్లో జీతం తీసుకుంటూ దాచుకోవడం... దోచుకోవడం తప్ప ప్రభుత్వానికి ఇచ్చిన సలహా ఏమిటని’ అచ్చెంనాయుడు ప్రశ్నించారు. 

Updated Date - 2022-08-09T02:21:58+05:30 IST