కౌన్సిలర్ సీటుకు రూ.20లక్షలు !
ABN , First Publish Date - 2022-01-30T16:39:54+05:30 IST
తిరుపత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి డీఎంకే కార్యకర్త ఒకరు ఎమ్మెల్యేలు జరుపుతున్న ఇంటర్వ్యూకు హాజరై బల్లపై రూ.20 లక్షల నోట్లను చల్లి సీటడిగారు. దీంతో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న డీఎంకే నేతలు,
- నోట్ల కట్టలు టేబుల్పై విసిరి అడిగిన DMK కార్యకర్త
చెన్నై: తిరుపత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి డీఎంకే కార్యకర్త ఒకరు ఎమ్మెల్యేలు జరుపుతున్న ఇంటర్వ్యూకు హాజరై బల్లపై రూ.20 లక్షల నోట్లను చల్లి సీటడిగారు. దీంతో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న డీఎంకే నేతలు, ఎమ్మెల్యేలు దిగ్ర్భాంతి చెందారు. వెంటనే ఆ నగదు తీసుకుని తిరిగి వెళ్ళమంటూ ఇంటర్వ్యూ చేస్తున్న డీఎంకే నేతలు అతనికి సలహా ఇచ్చారు. తిరుపత్తూరు మున్సిపాలిటీలో 36 వార్డులున్నాయి. ఆ వార్డుల్లో డీఎంకే తరఫున పోటీకి 154 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి తిరుపత్తూరు డీఎంకే నగర కార్యాలయంలో గత కొద్ది రోజులుగా ఇంటర్వ్యూలు జరుపుతున్నారు. డీఎంకే జిల్లా శాఖ కార్యదర్శి, ఎమ్మెల్యే దేవరాజ్, మరో శాసనసభ్యుడు నల్లతంబి, నగర కార్యదర్శి ఎస్.రాజేంద్రన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం ఓ వార్డులో పోటీకి దరఖాస్తు చేసుకున్న డీఎంకే నాయకుడు ఆ ఇంటర్వ్యూకు హాజరై రూ.20 లక్షల కరెన్సీ నోట్లను వారి ఎదుట ఉన్న టేబుల్పై చల్లి సీటి వ్వమన్నాడు. ఆ ప్రముఖుడి చేష్టకు ఇంటర్వ్యూలు జరుపుతున్న ఎమ్మెల్యేలు, డీఎంకే స్థానిక నాయకులు దిగ్ర్భాంతి చెందారు.