రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2020-08-04T10:57:46+05:30 IST
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీషీట్ తెరుస్తామని కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్ హెచ్చరించారు.
కుప్పం: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీషీట్ తెరుస్తామని కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్ హెచ్చరించారు. సోమవారం ఆయన గతంలో నేరాలకు పాల్పడిన డబ్బావాళ్లను, 36 మంది రౌడీషీటర్లను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ విలేకరులతో మాట్లాడుతూ ఎనిమిది మంది డబ్బావాళ్లకు బైండోవర్కు ఆదేశించినట్లు చెప్పారు. రహదారుల ఆక్రమణతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, మున్సిపల్, రెవెన్యూ అఽధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.