ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏలకు 11న కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2022-08-06T08:49:11+05:30 IST
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన 255 మంది ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏలకు ఈ నెల 11న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన 255 మంది ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏలకు ఈ నెల 11న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ తెలిపారు. వీరంతా 2018లో టీఎ్సపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యారు. అయితే వివిధ కారణాల వల్ల కౌన్సెలింగ్ నిర్వహించలేదు. అభ్యర్ధులంతా 11న హైదరాబాద్లోని వైద్యవిద్య సంచాలకుల కార్యాలయంలో జరిగే కౌన్సెలింగ్కు హాజరుకావాలని అజయ్కుమార్ తెలిపారు. అపాయింట్మెంట్, పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని వెల్లడించారు.