పత్తి ధర క్వింటం రూ.13,680
ABN , First Publish Date - 2022-05-21T05:50:33+05:30 IST
ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో పత్తి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఆదోని(అగ్రికల్చర్)మే
20: ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో పత్తి ధరలు రోజురోజుకు
పెరుగుతున్నాయి. శుక్రవారం పత్తిధర క్వింటం గరిష్ఠంగా రూ. 13,680 పలికింది.
పత్తి జిన్నింగ్ పరిశ్రమల్లో ఉత్పత్తికి అవసరమైన పత్తి లేకపోవడంతో
వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దూది,
పత్తి గింజల ధరలు పెరగడంతో స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో ధరలు
పెరగడానికి కారణమైంది. 231 క్వింటాలు పత్తి విక్రయానికి రాగా, వాటి కనిష్ఠ
ధర రూ.7వేలు, గరిష్ఠ ధర రూ.13,680, మధ్య ధర రూ.12,350 పత్తి ధర పలికింది.