విద్యుదాఘాతంతో పత్తి దగ్ధం
ABN , First Publish Date - 2020-11-29T05:22:09+05:30 IST
విద్యుదాఘాతంతో దాదాపు 50 క్వింటాళ్ల పత్తి, సామగ్రి దగ్ధమైంది.
దేవనకొండ, నవంబరు 28: విద్యుదాఘాతంతో దాదాపు 50 క్వింటాళ్ల పత్తి, సామగ్రి దగ్ధమైంది. మండలంలోని కరివేముల గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డె నాగరాజు తన పొలంలో పండించిన పంటను ఓ గదిలో ఉంచాడు. అయితే విద్యుదాఘాతంతో కాలిపోయింది. ఆర్డీవో రామకృష్ణారెడ్డి బాధితుడి ఇంటికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని తహసీల్దార్ తిరుమలవాణిని ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్ విష్ణుప్రసాద్, ఆర్ఐ హాజీమాలాంగ్బాబా, వీఆర్వో జనార్దన్, వైసీపీ నాయకులు ఎల్కే శ్రీనివాసులు, ఈరన్న, తిక్కయ్య, చెరువు శ్రీనివాసులు ఉన్నారు.