32లక్షల ఎకరాలకు చేరిన పత్తి సాగు

ABN , First Publish Date - 2022-07-07T09:58:52+05:30 IST

రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 32లక్షల ఎకరాలకు చేరింది.

32లక్షల ఎకరాలకు చేరిన పత్తి సాగు

హైదరాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 32లక్షల ఎకరాలకు చేరింది. అన్ని పంటలు కలిపి ఇప్పటివరకు 43.31 లక్షల ఎకరాల్లో సాగైనట్లు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక సమర్పించింది. ఈ వానాకాలంలో 75లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. దాంట్లో ఇప్పటి వరకు రైతులు 5% వరకు సాగు చేశారు. కంది  సాగు లక్ష్యం 15లక్షల ఎకరాలు కాగా... 2.72 లక్షల ఎకరాల్లో ఇప్పటిదాకా వేసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 

Updated Date - 2022-07-07T09:58:52+05:30 IST