అవినీతి ఫిర్యాదులను పరిశీలించడం లేదు

ABN , First Publish Date - 2020-08-15T08:25:42+05:30 IST

వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై వస్తున్న ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోగా పరిశీలించడం లేదని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వ శాఖల తీరు సక్రమంగా లేదంది...

అవినీతి ఫిర్యాదులను పరిశీలించడం లేదు

  • సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ 


న్యూఢిల్లీ, ఆగస్టు 14: వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై వస్తున్న ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోగా పరిశీలించడం లేదని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వ శాఖల తీరు సక్రమంగా లేదంది. కేసుల వివరాలను నిర్దేశిత సమయంలో ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని వివిధ ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరింది. కంప్లయింట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా ఫిర్యాదులను చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్లకు పంపాలని సూచించింది. ఫిర్యాదులపై నెలరోజుల్లోగా పరిశీలించి, పరిష్కరించాలని విజిలెన్స్‌ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది.


Updated Date - 2020-08-15T08:25:42+05:30 IST