జంగందేవర్ల సంక్షేమానికి కృషి
ABN , First Publish Date - 2022-06-27T01:56:09+05:30 IST
జంగం దేవర్ల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని జంగందేవర్ల కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ వీ ప్రసన్నకుమారి పేర్కొన్నారు.
కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ ప్రసన్నకుమారి
కావలి, జూన్ 26: జంగం దేవర్ల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని జంగందేవర్ల కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ వీ ప్రసన్నకుమారి పేర్కొన్నారు. జంగందేవర్ల సంక్షేమ సేవా సమితి జిల్లా సమావేశం ఆదివారం కావలి పట్టణంలోని గొట్టిపాటి చినసుబ్బానాయుడు కల్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు జంగమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి లోక్నాథం ఆనందరావు, కార్యనిర్వహక అధ్యక్షుడు ఆనందకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ రాయితీలు తమ సామాజిక వర్గంలోని అందరికి తెలిపి వాటిని సద్వినియోగం చేసుకునేలా కృసి చేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే రాష్ట్ర స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. సంఘ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో సంఘ కావలి పట్టణ అధ్యక్షుడు ఆనెగొంది నారాయణ, జిల్లా గౌరవాధ్యక్షుడు చంద్రమౌళి, వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరీ శంకర్, వీరబ్రహ్మయ్య, డాక్టర్ పామూరు శ్రీధర్, డాక్టర్ శివప్రసాద్, రాజ, గిరి తదితరులు పాల్గొన్నారు.