అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-04-13T05:59:51+05:30 IST
నగరపాలక సంస్థకు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చిపెట్టే గవర్నర్పేటలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఆదాయానికి గండిపెడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని 23వ డివిజన్ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి డిమాండ్ చేశారు.
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
ఎన్టీఆర్ కాంప్లెక్స్ను సందర్శించిన 23వ డివిజన్ కార్పొరేటర్ బాలస్వామి
గవర్నర్పేట, ఏప్రిల్ 12: నగరపాలక సంస్థకు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చిపెట్టే గవర్నర్పేటలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఆదాయానికి గండిపెడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని 23వ డివిజన్ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి డిమాండ్ చేశారు. స్థానిక వ్యాపారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం బాలస్వామి ఎన్టీఆర్ కాంప్లెక్స్ను సందర్శించి జరుగుతున్న అవకతవకలను పరిశీలించారు. అనంతరం బాలస్వామి మాట్లాడుతూ సెల్లార్ పార్కింగ్ను కార్పొరేషన్ సిబ్బంది నిర్వహించడం వల్ల ఏటా లక్షలాది రూపాయలు ఆదాయాన్ని కార్పొరేషన్ కోల్పోతుందన్నారు. తోపుడుబళ్ల వాళ్లకు సెల్లార్ను అద్దెలకు ఇస్తున్నారని, పార్కింగ్ టిక్కెట్లు కూడా దొంగవి ముద్రించి, టోకెన్లు రీసైక్లింగ్ చేస్తూ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. నాలుగేళ్లుగా అద్దె చెల్లించకుండా, సీసీ కెమెరాల నిర్వహణ చేయకుండా సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్నారు. కాంప్లెక్స్లో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానం తెస్తామని, కమిషనర్, మున్సిపల్ శాఖా మంత్రికి వినతిపత్రం అందజేస్తామని ఆయన తెలిపారు.