రెండో డిప్యూటీ మేయర్గా సజీలా ఎన్నిక
ABN , First Publish Date - 2021-07-31T05:31:08+05:30 IST
గుంటూరు నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్ 7వ డివిజన్ కార్పొరేటర్ షేక్ సజీలా ఎన్నికయ్యారు.
గుంటూరు(కార్పొరేషన్), జూలై 30: గుంటూరు నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్ 7వ డివిజన్ కార్పొరేటర్ షేక్ సజీలా ఎన్నికయ్యారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ వివేక్ యాదవ్ ఎన్నిక నిర్వహించారు. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు సజీలాను ప్రమాణ స్వీకారం చేయించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన అందరి సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత షేక్ సజీలాని అభినందించి, నగారాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ చల్లా అనురాధ, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్, డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పి.నిరంజన్రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు, వెంకట కృష్ణయ్య, సెక్రటరీ వసంతలక్ష్మీ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.