పేదలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-07-31T04:34:44+05:30 IST
పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తేవడమే ప్రధాన లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే గూడెంమహిపాల్రెడ్డి అన్నారు.
పటాన్చెరు, జూలై 30: పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తేవడమే ప్రధాన లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే గూడెంమహిపాల్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెం దిన 33 మంది లబ్ధిదారులకు రూ.9లక్షల 57వేల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను శుక్రవారం పటాన్చెరు క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమం లో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీలు కుమార్ గౌడ్, సుధాకర్రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాం డురంగారెడ్డి, కార్పొరేటర్ కుమార్యాదవ్ పాల్గొన్నారు.
పటాన్చెరు రూరల్: ముత్తంగి వివేకానంద నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన భూలక్ష్మి దేవత విగ్ర హ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉపేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.
జిన్నారం: బొల్లారం మున్సిపాలిటీకి చెందిన దీననాథ్కు వైద్య చికిత్స కోసం రూ.48వేల సీఎం రిలీ్ఫఫండ్ ఎల్వోసీని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్ చంద్రారెడ్డి బాధితుడి కుటుంబసభ్యులకు అందజేశారు.