దేశంలో తబ్లిఘి జమాత్‌ కేసులే అధికం.. ఎంతంటే?..

ABN , First Publish Date - 2020-04-05T01:41:33+05:30 IST

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలను ప్రకటించింది.

దేశంలో తబ్లిఘి జమాత్‌ కేసులే అధికం.. ఎంతంటే?..

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలను ప్రకటించింది. శనివారం సాయంత్రం నాటికి దేశవ్యాప్తంగా 3,072 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు 75 మంది భారతీయులు మృతి చెందారు. తబ్లిఘి జమాత్ లింక్‌ వల్ల 1,023 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 17 రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదిక ప్రకారం తబ్లిఘి జమాత్ లింక్‌తో 1,023 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి లావ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న మొత్తం కేసుల్లో 30 శాతం ఒక నిర్దిష్ట ప్రదేశంతో లింక్ ఉందని చెప్పారు. భారతదేశంలో కోవిద్-19 పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతున్నామని, భయపడాల్సిన అవసరం లేదని, అయితే యుద్ధంలో పోరాడటానికి అవగాహన అవసరమని అధికారి చెప్పారు. 

Updated Date - 2020-04-05T01:41:33+05:30 IST