కనిపించని సామాజిక దూరం
ABN , First Publish Date - 2020-04-03T09:02:05+05:30 IST
ప్రపంచాన్నే భయ భ్రాంతులకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం పాటిం చాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్, ఎస్పీలతో పలువురు ప్రజా ప్రతి
ఆదిలాబాద్టౌన్, ఏప్రిల్ 2: ప్రపంచాన్నే భయ భ్రాంతులకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం పాటిం చాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్, ఎస్పీలతో పలువురు ప్రజా ప్రతి నిధులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇదే సందర్భంలో సామాజిక దూరం తప్పనిసరి అని తమ ప్రసంగంలో వినిపిస్తున్నా జిల్లా పరి షత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్లు వారు నిర్వహించే కార్యక్రమాల్లో సామాజిక దూరం పాటించడం లే దు. గురువారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో ఉచిత బియ్యం పం పిణీ కార్యక్రమంలో సామాజిక దూరం పాటించకుండానే మున్సిపల్ చైర్మన్ బియ్యం పంపిణీ చేయగా అటు నార్నూర్ మండలంలోని తడి హత్నూర్ గ్రామంలో సామాజిక దూరం పాటించకుండా, నిబంధనలు మరిచి జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ ప్రజలకు ఉచిత బియ్యం పంపి ణీ చేశారు.