అగ్రరాజ్యంలో 2లక్షలకు చేరువలో కరోనా మరణాలు!

ABN , First Publish Date - 2020-09-21T02:14:45+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 42వేలపైగా క

అగ్రరాజ్యంలో 2లక్షలకు చేరువలో కరోనా మరణాలు!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 42వేలపైగా కరోనా కేసులు నమోదవ్వగా.. 657 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్, జార్జియా రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. మరణాల సంఖ్య పరంగా న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాలు మొదటి  ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. కొత్తగా నమోదైన కేసుల సంఖ్యతో కలిపి అమెరికాలో ఇప్పటి వరకు కరోనా బారినపడ్డ వారి సంఖ్య 69.67లక్షలకు చేరింది. సుమారు 2లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-09-21T02:14:45+05:30 IST