బీపీ ఉన్న వ్యక్తికి కరోనా సోకి మృతి

ABN , First Publish Date - 2020-03-27T11:57:47+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలో కొవిడ్-19‌తో మరో రోగి మరణించారు. భిల్వారా నగరానికి చెందిన కరోనా వైరస్ పాజిటివ్ రోగికి కిడ్నీ, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతూ మరణించాడని....

బీపీ ఉన్న వ్యక్తికి కరోనా సోకి మృతి

భిల్వారా (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలో కొవిడ్-19‌తో మరో రోగి మరణించారు. భిల్వారా నగరానికి చెందిన కరోనా వైరస్ పాజిటివ్ రోగికి కిడ్నీ, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతూ మరణించాడని మహాత్మాగాంధీ ఆసుపత్రి డాక్టర్ రాజన్ నందా చెప్పారు. రాజస్థాన్ రాష్ట్రంలో గురువారం మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకడంతో వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 43కు చేరింది. జైపూర్ నగరంలోని రాంగంజ్ ప్రాంతానికి చెందిన ఓ రోగికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో రావడంతో అతన్ని కూడా ఆసుపత్రికి తరలించారు. అత్యధిక జనసమ్మర్ధం ఉన్న రాంగంజ్ ప్రాంతంలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో చుట్టూ కిలోమీటరు దూరం కర్ఫ్యూ విధించారు. 

Updated Date - 2020-03-27T11:57:47+05:30 IST