కరోనా చిత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్న చిత్రకారులు
ABN , First Publish Date - 2020-04-11T00:20:06+05:30 IST
జిల్లాలోని పటాన్చెరు పట్టణంలోని బస్టాండ్ ముందు పటాన్చెరు కమర్షియల్ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై కరోనా నిర్మూలనకు అవగాహన కోసం చిత్రకారులు
సంగారెడ్డి: జిల్లాలోని పటాన్చెరు పట్టణంలోని బస్టాండ్ ముందు పటాన్చెరు కమర్షియల్ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై కరోనా నిర్మూలనకు అవగాహన కోసం చిత్రకారులు తమ ప్రదర్శన ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తెస్తున్నారు. ‘‘కరోనా కట్టడి కోసం ప్రభుత్వ సూచనలు పాటించండి. లాక్డౌన్ను పాటించండి’’ అంటూ రహదారిపై వెళ్లే వాహనదారులకు చిత్రకారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచంలోనే ఇది వినూత్న ప్రయోగం అని కొనియాడుతున్నారు. కరోనాపై సామాన్యులకు చైతన్యం కల్గించడానికి చిత్రం లేఖనం ద్వారా చిత్రకారులు ఓ విప్లవం సృష్టించారని ప్రశంసలు కురిపిస్తున్నారు.