లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి.. వెయ్యి కిలోమీటర్లు రిక్షా తొక్కుకుంటూ...

ABN , First Publish Date - 2020-03-26T17:07:04+05:30 IST

కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇది కోట్లాది మందిని రోడ్డుపై నిలబడేలా చేసింది. సొంత ఇళ్లకు వందల కిలోమీటర్ల దూరంలో...

లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి.. వెయ్యి కిలోమీటర్లు రిక్షా తొక్కుకుంటూ...

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇది కోట్లాది మందిని రోడ్డుపై నిలబడేలా చేసింది. సొంత ఇళ్లకు వందల కిలోమీటర్ల దూరంలో వున్న వేలాది మంది కూలీలు ఇంటికి తిరుగుముఖం పట్టారు. కొందరు కాలినడకన, కొందరు సైకిల్‌పై, మరికొందరు రిక్షాలో ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అలాంటివారిలో ఒకరైన హరేంద్ర మహతో  రిక్షాలో ఢిల్లీ నుండి బీహార్ లోని మోతీహరికి తరలివెళ్లారు. ఐదుగురు కుటుంబ సభ్యులను రిక్షాలో తీసుకోని ఇంటికి బయలుదేరారు. ఢిల్లీ నుండి అతని ఇంటికి 1018 కిలోమీటర్ల దూరం. ఇందుకోసం ఏడు రోజులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇదేవిధంగా మరో 14 మంది కార్మికులు సైకిల్‌ రిక్షాలో యుపిలోని బల్రాంపూర్‌కు బయలుదేరారు. వారిలో ఒకరు దివ్యాంగుడు.

Updated Date - 2020-03-26T17:07:04+05:30 IST