లాక్ డౌన్ లో సమోసాలు పంపించి... కాలువల్లో చెత్త తీయించారు!

ABN , First Publish Date - 2020-03-30T14:07:41+05:30 IST

కరోనా వైరస్ నివారణకు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. అయితే లాక్ డౌన్ నియమాలను కూడా చాలా చోట్ల ఉల్లంఘిస్తున్నారు.

లాక్ డౌన్ లో సమోసాలు పంపించి... కాలువల్లో చెత్త తీయించారు!

రాంపూర్: కరోనా వైరస్ నివారణకు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. అయితే లాక్ డౌన్ నియమాలను చాలా చోట్ల ఉల్లంఘిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఒక వ్యక్తిపై రాంపూర్ జిల్లాకు చెందిన డీఎం విచిత్రమైన చర్యలు చేపట్టారు. ఒక వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు పదేపదే కాల్ చేసి ఉద్యోగులను వేధిస్తున్నాడు. ఆ వ్యక్తి సమోసాలు తీసుకురావాలని కోరాడు. దీనిని తెలుసుకున్న  డీఎం ఆ వ్యక్తికి సమోసాలను పంపించి, తరువాత అతని చేత మురుగుకాలువను శుభ్రం చేయించారు. ప్రభుత్వ సహాయ వ్యవస్థను దుర్వినియోగం చేసేవారికి ఇలాంటి  శిక్షలు విధిస్తామని డీఎం  ట్వీట్ చేశారు. జాతీయ విపత్తు సమయంలో ఇలాంటి పనులు చేయడం తగదన్నారు. 

Updated Date - 2020-03-30T14:07:41+05:30 IST