9/11 దాడిలో కంటే ఎక్కువ మంది చనిపోయారు: అమెరికా ఉన్నతాధికారి

ABN , First Publish Date - 2020-04-01T03:35:43+05:30 IST

వరల్డ్ ట్రేండ్ సెంటర్ పై జరిగిని ఉగ్రదాడిలో కంటే ఎక్కువ మంది కరోనా కు బలయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.

9/11 దాడిలో కంటే ఎక్కువ మంది చనిపోయారు: అమెరికా ఉన్నతాధికారి

వాషింగ్టన్: కరోనా మహమ్మారి ఇప్పటి వరకు 3100 మందికి పైగా అమెరికన్లను పొట్టనపెట్టుకుంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.64 లక్షలు దాటిపోయింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం దాదాపు 2 లక్షల మంది అమెరికన్లు కరోనాకు బలవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితి తీవ్రతను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫ్‌క్షియస్ డిసీజెస్ డైరెక్టర్ ఆంథొని ఫాసీ కళ్లకు కట్టినట్టు వివరించారు. వరల్డ్ ట్రేండ్ సెంటర్ పై జరిగిన ఉగ్రదాడిలో కంటే ఎక్కువ మంది కరోనాకు బలయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-04-01T03:35:43+05:30 IST