9/11 దాడిలో కంటే ఎక్కువ మంది చనిపోయారు: అమెరికా ఉన్నతాధికారి
ABN , First Publish Date - 2020-04-01T03:35:43+05:30 IST
వరల్డ్ ట్రేండ్ సెంటర్ పై జరిగిని ఉగ్రదాడిలో కంటే ఎక్కువ మంది కరోనా కు బలయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.
వాషింగ్టన్: కరోనా మహమ్మారి ఇప్పటి వరకు 3100 మందికి పైగా అమెరికన్లను పొట్టనపెట్టుకుంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.64 లక్షలు దాటిపోయింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం దాదాపు 2 లక్షల మంది అమెరికన్లు కరోనాకు బలవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితి తీవ్రతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫ్క్షియస్ డిసీజెస్ డైరెక్టర్ ఆంథొని ఫాసీ కళ్లకు కట్టినట్టు వివరించారు. వరల్డ్ ట్రేండ్ సెంటర్ పై జరిగిన ఉగ్రదాడిలో కంటే ఎక్కువ మంది కరోనాకు బలయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.