ఆదాయపు పన్నుశాఖ అధికారుల వర్క్ ఫ్రం హోం
ABN , First Publish Date - 2020-04-01T13:37:22+05:30 IST
లాక్డౌన్తో ఆదాయపు పన్నుశాఖ అధికారులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.....
న్యూఢిల్లీ : లాక్డౌన్తో ఆదాయపు పన్నుశాఖ అధికారులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ చేసిన నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇంటి నుంచే పనిచేసేలా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డేటా కార్డులు, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లను కేంద్రఆర్థికశాఖ అందించింది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అధికారులు ఫెసిలిటేటర్లుగా ఫోన్,ఆన్లైన్లో సహాయం చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబీడీటీ) ఐటీ అధికారులను కోరింది. ఐటీ అధికారులు ఏప్రిల్ 14వతేదీ వరకు ఇంటినుంచే పనిచేస్తూ పర్యవేక్షకులకు రోజువారీ నివేదికను పంపించాలని ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐటీ అధికారులు పన్నుల వసూళ్ల కోసం బలవంతం చేయవద్దని కేంద్రం సూచించింది.