యాంటీ మలేరియా ఔషధాల ఎగుమతిపై కేంద్రం నిషేధం

ABN , First Publish Date - 2020-03-25T11:40:08+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో యాంటీ మలేరియా ఔషధాల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది....

యాంటీ మలేరియా ఔషధాల ఎగుమతిపై కేంద్రం నిషేధం

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో యాంటీ మలేరియా ఔషధాల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కరోనా వైరస్ బారినపడిన రోగులకు యాంటీ మలేరియా ఔషధమైన హైడ్రాక్సీక్లోరోక్విన్ వినియోగిస్తున్నందున దేశంలో ఈ ఔషధాల కొరత ఏర్పడకుండా ముందుజాగ్రత్తగా కేంద్ర విదేశాంగ శాఖ సూచన మేర డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ బుధవారం ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.


కరోనా వైరస్ రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడవచ్చని భారతీయ వైద్య పరిశోధనామండలి డైరెక్టరు జనరల్ భార్గవ సిఫార్సు చేయడంతో కేంద్రం ఈ ఔషధాల ఎగుమతిని నిలిపివేసింది. గత వారం కరోనా వ్యాప్తి నేపథ్యంలో శానిటైజర్లు, వెంటిలేటర్ల ఎగుమతిని కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. రోగులకు కృత్రిమ శ్వాస అందించేందుకు ఉపయోగపడే ఉపకరణాలు, ఆక్సిజన్‌ థెరపీ పరికరాలు కూడా ఎగుమతి నిషేధం పరిధిలోకి వస్తాయని కేంద్రం తెలిపింది. 

Updated Date - 2020-03-25T11:40:08+05:30 IST