కేంద్రం, మర్కజ్ వల్లే కేసులు పెరిగాయి: చెరుకు
ABN , First Publish Date - 2020-04-03T07:48:41+05:30 IST
కేంద్ర ప్రభుత్వం, మర్కజ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. ఒక మతం వారి...
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం, మర్కజ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. ఒక మతం వారి సభతోనే కేసులు పెరిగాయని పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని, వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో వైద్యులపై దాడులను తమ పార్టీ ఖండిస్తోందని చెప్పారు.