బ్రెజిల్‌లో కరోనా విలయం.. లక్షకు చేరువలో మరణాల సంఖ్య!

ABN , First Publish Date - 2020-08-09T03:03:44+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ.. ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. వరల్డ్ఒమీటర్.

బ్రెజిల్‌లో కరోనా విలయం.. లక్షకు చేరువలో మరణాల సంఖ్య!

వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ.. ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. వరల్డ్ఒమీటర్.ఇన్‌ఫోలోని సమాచారం ప్రకారం.. అమెరికాలో నిన్న ఒక్కరోజే.. 63వేలకుపైగా కరోనా కేసులు నమోదవ్వగా.. సుమారు 1300 మంది ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 10వేలు దాటింది. కాగా.. అమెరికాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 51లక్షలకు చేరువలో ఉంది. ఇందులో 1.64లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం అమెరికాలో 23లక్షలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. బ్రెజిల్‌లో కూడా కొవిడ్ విజృంభిస్తోంది. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 29.67లక్షలకు చేరింది. మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య అత్యధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. బ్రిజిల్ రెండో స్థానంలో ఉంది. 


Updated Date - 2020-08-09T03:03:44+05:30 IST