మియాపూర్లో కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-03-29T10:34:56+05:30 IST
మియాపూర్ లో లండన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని ప్రచారం జరగడం కలకలం రేపింది.
ఈనెల 18 నుంచి 21వరకు హోటల్లో బస చేసిన వ్యక్తి
హోటల్ను సీజ్ చేసి హైపో క్లోరైడ్ రసాయనాలు పిచికారి
మియాపూర్, మార్చి 28(ఆంధ్రజ్యోతి) : మియాపూర్ లో లండన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని ప్రచారం జరగడం కలకలం రేపింది. ఈ నెల 18న లండన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి(23) 21వ తేదీ వరకు ఓ హోటల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి ఈనెల 18న శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుం చి క్యాబ్లో హోటల్లో దిగాడు. అతనికి కరోనా అని ప్రచారం జరిగింది. దీంతో శనివారం రంగంలోకి దిగిన పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది హోటల్ పరిసరాల్లో హైపో క్లోరైడ్ రసాయనాలు పిచికారి చేశారు. కరోనా సోకిన వ్యక్తి హోటల్లో ఉన్న సమయంలో అక్కడ పనిచేసిన సిబ్బందిని వైద్య పరీక్షల కోసం పంపించారు. హోటల్ను జీహెచ్ఎంసీ యంత్రాంగం సీజ్ చేసింది.