తెలంగాణలో 9కి పెరిగిన కరోనా మరణాలు
ABN , First Publish Date - 2020-04-03T03:08:18+05:30 IST
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 154కు చేరాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 154కు చేరింది. తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 9 మంది మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇవాళ ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 17 మందిని డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు చెప్పారు.