కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కూల్చివేతలు: రేవంత్
ABN , First Publish Date - 2020-04-03T07:44:10+05:30 IST
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కొండ పోచమ్మ ప్రాంతంలోని బహిలింపూర్, మామిడ్యాల, తనేదార్పల్లిలో ప్రభుత్వం కూల్చివేతలు...
హైదరాబాద్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కొండ పోచమ్మ ప్రాంతంలోని బహిలింపూర్, మామిడ్యాల, తనేదార్పల్లిలో ప్రభుత్వం కూల్చివేతలు చేపడుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఆరోపించారు. కలెక్టర్ వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో ఉన్నపళంగా ఇళ్లను కూల్చి రైతుల బతుకులను బజారు పాలు చేస్తున్నారని గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు.