ఏపీలో 16 చేరిన కరోనా కేసులు.. తాజాగా మూడు గుర్తింపు

ABN , First Publish Date - 2020-03-29T02:53:30+05:30 IST

ఏపీలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16కు చేరినట్లు వైద్యులు తెలిపారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఒకటి, ప్రకాశం జిల్లాలో..

ఏపీలో 16 చేరిన కరోనా కేసులు.. తాజాగా మూడు గుర్తింపు

హైదరాబాద్: ఏపీలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16కు చేరినట్లు వైద్యులు తెలిపారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఒకటి, ప్రకాశం జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు చెప్పారు. కర్నూలు జిల్లా సంజామల మండలం నొస్సంలో రాజస్థాన్ వెళ్లొచ్చిన యువకుడికి కరోనా లక్షణాలు గుర్తించినట్లు వెల్లడించారు. ఆ యువకుడిని కలిసిన 18 మందిని బనగానపల్లి క్వారంటైన్ సెంటర్‌కు తరలించినట్లు స్పష్టం చేశారు.  ప్రకాశం జిల్లా చీరాలలో దంపతులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 12న ఢిల్లీలో దంపతులిద్దరు మతపరమైన కార్యక్రమానికి వెళ్లి 18న ఒంగోలుకు వెళ్లినట్లు గుర్తించారు. వీరిని ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు. 


Updated Date - 2020-03-29T02:53:30+05:30 IST