పాకిస్తాన్‌కు 100 బ్రాండెడ్ వెంటిలేటర్లను విరాళంగా ఇచ్చిన అమెరికా

ABN , First Publish Date - 2020-07-04T00:15:46+05:30 IST

పాకిస్తాన్‌కు 100 బ్రాండెడ్ వెంటిలేటర్లను విరాళంగా ఇచ్చిన అమెరికా

పాకిస్తాన్‌కు 100 బ్రాండెడ్ వెంటిలేటర్లను విరాళంగా ఇచ్చిన అమెరికా

ఇస్లామాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ పాకిస్థాన్ దేశంలో రోజురోజుకూ కోవిడ్ -19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి పాకిస్థాన్ చేస్తున్న పోరాటానికి అమెరికా మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ దేశానికి అమెరికా సాయం చేసింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా పాకిస్థాన్ దేశానికి 100 వెంటిలేటర్లను విరాళంగా ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. 3 మిలియన్ డాలర్ల విలువైన 100 బ్రాండెడ్ వెంటిలేటర్లను పాకిస్థాన్ కు విరాళంగా ఇచ్చినట్లు అమెరికా తెలిపింది. పాకిస్థాన్ లో ఉన్న ఆస్పత్రులకు 100 వెంటిలేటర్లను పంపించారు.


Updated Date - 2020-07-04T00:15:46+05:30 IST