అనంతపురం జిల్లా హిందూపురంలో మెరుపు ధర్నా
ABN , First Publish Date - 2020-05-27T04:15:22+05:30 IST
హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వందలాది మందితో ముక్కిడిపేట వాసులు మెరుపు ధర్నా చేపట్టారు..
అనంతపురం: హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వందలాది మందితో ముక్కిడిపేట వాసులు మెరుపు ధర్నా చేపట్టారు. ముక్కిడిపేట రెడ్ జోన్లో ఉంది. లాక్ డౌన్ ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో లాక్ డౌన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్పీ మహబూబ్ బాషాను చుట్టుముట్టారు. నెలాఖరు వరకు లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్టు ఏఎస్పీ ప్రకటించారు. దీంతో ముక్కిడిపేట వాసులు ఆందోళన విరమించారు.