స్వచ్ఛంద సేవలు అందించండి
ABN , First Publish Date - 2020-03-29T09:48:12+05:30 IST
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జిల్లాలోని ప్రైవేటు వైద్యులు కూడా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్కుమార్ పిలుపునిచ్చారు.
ప్రైవేటు వైద్యులకు కలెక్టర్ పిలుపు
గుంటూరు (మెడికల్), మార్చి 27: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జిల్లాలోని ప్రైవేటు వైద్యులు కూడా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్కుమార్ పిలుపునిచ్చారు. స్వచ్చంధంగా రోగులకు సేవలు అందించాలని కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లాలోని ప్రైవేటు వైద్యశాలల యజమానులు, ఐఎంఏ డాక్టర్లతో, అప్నా సభ్యులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
అవసరమైన సందర్భాల్లో ప్రైవేటు హాస్పిటల్ సిబ్బందిని ప్రభుత్వాస్పత్రుల్లో సేవలకు పంపాలన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, తాను స్వచ్చంధంగా సేవలను లిఖితపూర్వక లేఖను కలెక్టర్ ఆనంద్కుమార్కు అందజేశారు.