తెలంగాణ ప్రజలకు దడపుట్టిస్తోన్న కరోనా వైరస్

ABN , First Publish Date - 2021-04-14T16:29:35+05:30 IST

తెలంగాణలో కరోనా వైరస్ ప్రజలకు దడపుట్టిస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 2,157 కరోనా కేసులు...

తెలంగాణ ప్రజలకు దడపుట్టిస్తోన్న కరోనా వైరస్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ప్రజలకు దడపుట్టిస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 2,157 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్‎తో 8 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకు మంగళవారం వచ్చిన కేసులతో కలిపి 3.34 లక్షలకు కరోనా కేసులు చేరాయి. కరోనా వల్ల ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 1,780 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,459 యాక్టివ్ కేసులు ఉండగా..కరోనా నుంచి 3.07 లక్షలు కోలుకున్నారు. ఇక జిల్లాల వారీగా చూస్తే..జీహెచ్ఎంసీ పరిధిలో 361, మేడ్చల్‎లో 245, రంగారెడ్డిలో 206 కేసులు నమోదైనట్లు. బుధవారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‎లో వెల్లడించింది. 

Updated Date - 2021-04-14T16:29:35+05:30 IST