అందరికీ ఉచితంగా కరోనా టెస్ట్‌లు చేయాలి: కాల్వ

ABN , First Publish Date - 2020-04-10T01:07:05+05:30 IST

కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

అందరికీ ఉచితంగా కరోనా టెస్ట్‌లు చేయాలి: కాల్వ

గుంటూరు: కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కరోనా వైద్యసేవలు అందిస్తూ మృతిచెందిన వారి కుటుంబాలకు..రూ.50 లక్షలు ఇవ్వాలని కాల్వ శ్రీనివాసులు అన్నారు. రైతుల కరెంట్‌, నీటి బిల్లులను రద్దు చేయాలని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలని తెలిపారు. అందరికీ ఉచితంగా కరోనా టెస్ట్‌లు చేయాలని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

Updated Date - 2020-04-10T01:07:05+05:30 IST