ఏపీలో ఒక్కరోజే 16 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-04-11T02:12:56+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా మరో 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ కోవిడ్-19 నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ తెలిపారు.

ఏపీలో ఒక్కరోజే 16 కరోనా కేసులు నమోదు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా మరో 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ కోవిడ్-19 నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఏపీలో ప్రస్తుతం శుక్రవారం సాయంత్రం నాటికి మొత్తం 381 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం జిల్లాల్లో నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 7 కరోనా కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 5 కరోనా కేసులు, కర్నూలు జిల్లాలో 2 కరోనా కేసులు, ప్రకాశం జిల్లాలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు కరోనా వల్ల ఆరుగురు మృతి చెందారు. కరోనా నుంచి కోలుకొని 10 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో 365 మందికి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అనంతపురం 15, చిత్తూరు 20, తూ.గో. 17, గుంటూరు 58, కడప 29, కృష్ణా 35, కర్నూలు 77, నెల్లూరు 48, ప్రకాశం 40, విశాఖ 20, ప.గో. జిల్లాలో 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2020-04-11T02:12:56+05:30 IST