రాష్ట్రంలో కొత్త కేసులు 3,676

ABN , First Publish Date - 2020-10-18T09:15:55+05:30 IST

రాష్ట్రంలో కొత్త కేసులు 3,676

రాష్ట్రంలో కొత్త కేసులు 3,676

మరో 24 మంది మృతి 

మొత్తం పాజిటివ్‌లు 7,79,146 

6,406కు చేరిన కరోనా మరణాలు 


అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 3,676 మంది కరోనా బారినపడ్డారు. శుక్రవారం 70,881 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 7,79,146కు చేరుకున్నాయి. తాజాగా 5,529 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 7,35,638 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 37,102 మంది ఆస్పుత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకూ 24మంది కరోనాకు బలయ్యారు. చిత్తూరులో ఐదుగురు, గుంటూరు, కృష్ణాజిల్లాల్లో నలుగురు చొప్పున, విశాఖలో ముగ్గురు, అనంత, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 6,406కు చేరాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా 997 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 85,563కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో గడిచిన 24గంటల్లో 567 మంది కొవిడ్‌ బారినపడ్డారు. ఇక్కడ బాధితుల సంఖ్య 1,09,611గా రికార్డయింది. కృష్ణాజిల్లాలో మరో 308 కేసులు వెలుగు చూశాయి. విజయనగరం జిల్లాలో శనివారం 91 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 38,193కి చేరింది. శ్రీకాకుళం జిల్లాలో మరో 125 పాజిటివ్‌లు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో మరో 193 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శనివారం 91 పాజిటివ్‌లు వెలుగు చూశాయి. గుంటూరు జిల్లాలో మరో 259 మందికి పాజిటివ్‌ వచ్చింది. చిత్తూరు జిల్లాలో మరో 473 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. విశాఖ జిల్లాలో మరో 204 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 54,100కు చేరుకుంది. కడప జిల్లాలో 246 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 49,782కు చేరింది. ఇప్పటి వరకు 482మంది మృత్యువాత పడ్డారు. నెల్లూరు జిల్లాలో కొత్తగా 240 కేసులు వెలుగు చూశాయి. 


కరోనా బాధితుడి ఆత్మహత్య 

ఏలూరు: కరోనా సోకిన ఓ బాధితుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి(42)కి పాజిటివ్‌ రావడంతో ఏలూరు సమీపంలోని ఆశ్రం ఆస్పత్రిలో ఈనెల 15న చేర్పించారు. కరోనా సోకిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన శనివారం తెల్లవారుజామున ఆస్పత్రిలోని మరుగుదొడ్డిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-10-18T09:15:55+05:30 IST