కల్తీ సారా తాగి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-04-05T13:57:43+05:30 IST

కల్తీ సారా తాగి వ్యక్తి మృతి

కల్తీ సారా తాగి వ్యక్తి మృతి

చెన్నై: తిరుపత్తూర్‌ జిల్లా ఆంబూరు సమీపం నాయకనేరి కొండ ప్రాంతంలో కొందరు కల్తీ సారాను విక్రయిస్తున్నారు. సీకియపొన్నెకు చెందిన కూలీ వెంక టేషన్‌ (30) శుక్రవారం ఆ ప్రాంతంలోని సారా తాగిన వెంటనే మైకంతో కింద పడిపోయాడు. ఆయనను వెంటనే సమీపంలోని వారు ఆంబూరు ప్రభుత్వా సుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై ఆంబూరు తాలూకా పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. కల్తీ సారా తాగడంతోనే ఆయన మృతిచెందినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Updated Date - 2020-04-05T13:57:43+05:30 IST