క్వారంటైన్‌ సెంటర్ల పరిశీలన

ABN , First Publish Date - 2020-04-04T11:47:47+05:30 IST

కరోనా వైరస్‌ను స్వీయ నియంత్రణ ద్వారానే కట్టడి చేయగలమని ఆర్డీవో లక్ష్మారెడ్డి అన్నారు.

క్వారంటైన్‌ సెంటర్ల పరిశీలన

కొవ్వూరు / నిడదవోలు, ఏప్రిల్‌ 3 : కరోనా వైరస్‌ను స్వీయ నియంత్రణ ద్వారానే కట్టడి  చేయగలమని ఆర్డీవో లక్ష్మారెడ్డి అన్నారు. కొవ్వూరు పట్టణం లోని ఏబీఎన్‌ కళాశాల, దీప్తి పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంట ర్‌ను శుక్రవారం ఆర్డీవో పరిశీలించారు. డివిజన్‌లోని కొవ్వూరు, నిడదవోలు పట్టణంలో ప్రస్తుతం టిడ్కో నిర్మించిన భవనాల్లో రెండు క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాలకు 25 మందిని తరలించి వైద్య సేవలందిస్తున్నామన్నారు.అనుమానితులు ఎక్కువ అయితే కానూరు, వేలివెన్ను శశి విద్యా సంస్థలను గుర్తించామన్నారు. డివిజన్‌లో 96 శాతం రేషన్‌ పంపిణీ చేశామన్నారు. నిడదవోలు పరిధిలో బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసం తీరుగూడెంలో క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని మునిసిపల్‌ కమిషనర్‌ కె.వి.పద్మావతి అన్నారు. శుక్రవారం నిడద వోలులోని తీరుగూడెంలోని క్వారంటైన్‌ సెంటర్‌ను ఆమె పరిశీలించారు. కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్యం పనులు పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. 

Updated Date - 2020-04-04T11:47:47+05:30 IST