విజయవాడలో కరోనాతో ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2021-07-28T12:02:16+05:30 IST
జిల్లాలో కరోనా బారినపడిన మరో ఇద్దరు బాధితులు మంగళవారం మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 263 మందికి వైరస్ సోకింది.
విజయవాడ: జిల్లాలో కరోనా బారినపడిన మరో ఇద్దరు బాధితులు మంగళవారం మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 263 మందికి వైరస్ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 1,07,676కు పెరిగాయి. మొత్తం కరోనా మరణాలు అధికారికంగా 1,193కుచేరుకున్నాయి. వైరస్ బారినపడివారిలో ఇప్పటి వరకు 1,03,778 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా 2,705 మంది పాజిటివ్ బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.