ఏపీ కరోనా తాజా అప్డేట్
ABN , First Publish Date - 2021-07-27T22:48:53+05:30 IST
ఏపీ కరోనా తాజా అప్డేట్
అమరావతి: ఏపీలో కొత్తగా 1,540 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 19 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 19,57,932 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 13,292 మంది మరణించారు. 20,965 యాక్టివ్ కేసులు ఉండగా, 19,23,675 మంది రికవరీ అయ్యారు. గత 24 గంటల్లో 2,304 మంది రికవరీ అయ్యారు. అలాగే 61,298 శాంపిల్స్ సేకరించారు. ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కడప, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.